pregnyadigital రాష్ట్ర వార్తలు,వార్తలు Telangana: అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం?

Telangana: అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం?


మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ చెరువు వద్దకు వెళ్లిన పదేళ్ల బాలిక అదృశ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తరువాత చెరువులో ఒక మృతదేహం కనుగొనబడింది మరియు భద్రతా కెమెరాల ఫుటేజీ ఆధారంగా, బాలిక స్వయంగా అక్కడికి వెళ్లిందని భావిస్తున్నారు.

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన పదేళ్ల ఏళ్ల చిన్నారి ఘటన విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు మృతదేహన్ని కనుగొన్నారు. ఇందు మృతిపై బాలిక తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ తమ పాపను ఏదైనా చేయకూడనిది చేసి దమ్మాయిగూడ చెరువులో పడేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

నాల్గవ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నారి గురువారం తప్పిపోయింది. డిసెంబర్ 15వ తేదీ ఉదయం పాప తండ్రి దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద బాలికను వదిలిపెట్టి వెళ్లగా.. ఆ తర్వాత నుంచి పాప కన్పించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభించింది.

వివరాల్లోకి వెళ్తే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని ఇందు గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన తర్వాత.. ఆడుకుంటానని బయటకి వెళ్లి అదృశ్యం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయాలని ప్రసార, సామాజిక మాద్యమాలు ద్వారా ప్రచారం చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరికి బాలిక మృతదేహం లభించింది.

Tags:

Related Post

Chandrababu Naidu: రాబోయే ఎన్నికలపై ప్రకటనChandrababu Naidu: రాబోయే ఎన్నికలపై ప్రకటన

Chandrababu Naidu: రాబోయే ఎన్నికలపై ప్రకటన రాబోయే ఎన్నికలపై చంద్రబాబు నాయుడు ప్రకటన. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబు

Prabhas ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా??Prabhas ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా??

ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా?? కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ సినిమాల డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు

నారి నారి నడుమ నట సింహం నందమూరి బాలకృష్ణ!నారి నారి నడుమ నట సింహం నందమూరి బాలకృష్ణ!

నట సింహం నందమూరి బాలకృష్ణ నారీ నారి నడుమలో డ్యాన్స్ చేస్తే? పాట సూపర్ హిట్! ఎందుకంటే ఇది కోళ్లను గుర్తుకు తెస్తుంది, ఇది సంభాషణలో సాధారణ మరియు ప్రజాదరణ పొందిన అంశం. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య డ్యాన్స్ చేయడంతో మళ్లీ