pregnyadigital క్రీడలు cricket టీమిండియాను టెన్షన్ పెడుతున్న ఆ ఒక్క ఓవర్.

cricket టీమిండియాను టెన్షన్ పెడుతున్న ఆ ఒక్క ఓవర్.

టీమిండియాను టెన్షన్ పెడుతున్న ఆ ఒక్క ఓవర్..

భారత జట్టు గత ఐదు T20 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన టీమిండియా ఆఫ్రికాపై 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. అయితే , ఇలా అదరగొడుతున్న టీమిండియాను మాత్రం ఒక సమస్య తీవ్రంగా వేధిస్తుంది.టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup 2022)కు ముందు టీమిండియా (Team India) బ్యాట్స్‌మెన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి లయను అందుకున్నారు. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ ఫేజ్ లో ఉన్నాడు. దినేష్ కార్తీక్ కూడా ఫినిషర్‌గా మెరిశాడు. అయితే టీమిండియాను వెంటాడుతున్న సమస్య బౌలింగ్.

భారత బౌలింగ్‌లో సమస్య అలాగే ఉంది. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు చాలా పరుగులు సమర్పించుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్ నుంచి ఔట్ అయ్యాడు. అటువంటి పరిస్థితిలో, భువనేశ్వర్ కుమార్ జట్టులోని సీనియర్ మోస్ట్ బౌలర్ అవుతాడు. అయితే గత కొన్ని మ్యాచ్‌ల్లో భువీ కూడా నిరాశపరిచాడు.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నుంచే భారత జట్టు జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయింది. ఇక ఆఖరి టీ20లో విజిటింగ్ టీమ్ చివరి 12 బంతుల్లో 46 పరుగులు చేసింది. ఈ విషయం రోహిత్ శర్మకు కూడా అర్థమైంది.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. \’జస్ప్రీత్ బుమ్రా గాయపడడం మాకు ఆందోళన కలిగించే విషయం. చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాలి \” అని ఆందోళన వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ మరియు అర్ష్దీప్ సింగ్. దీపక్ చాహర్, మహ్మద్ షమీలను రిజర్వ్ ప్లేయర్లుగా చేర్చారు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు. భారత్‌ తరఫున ఆడిన చివరి 10 టీ20 మ్యాచ్‌ల్లో బుమ్రా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 6 ఓవర్లలో 73 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. భువనేశ్వర్ కుమార్ వైట్ బాల్ క్రికెట్‌లో భారతదేశానికి అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్.

గత 7 టీ20 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. అయితే, అతను మూడు మ్యాచ్‌లలో డెత్ ఓవర్లలో ఘోరంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్‌లోనూ, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు. కొత్త బంతి నుంచి స్వింగ్ రాకపోతే భువీ అంత ప్రభావవంతంగా లేడు.ఐపీఎల్ 2022లో మెరుగైన ప్రదర్శనతో హర్షల్ పటేల్ టీమ్ ఇండియాలో చోటు సంపాదించాడు. ఈ ఏడాది 20 టీ20 మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు. అయితే, అతని ఎకానమీ రేటు ఆందోళన కలిగించే విషయం. ఓవర్‌కు 9.22 పరుగులు ఇస్తున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో 16 ఓవర్లలో 170 పరుగులు వచ్చాయి. మూడు వికెట్లు మాత్రమే తీయడంలో సఫలమయ్యాడు. అంటే ప్రతి ఓవర్లో దాదాపు 11 పరుగులు ఇచ్చాడు.

భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవలి కాలంలో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తొలి ఓవర్‌లోనే వికెట్ తీయడంలో సఫలమయ్యాడు. అయితే రెండో టీ20 మ్యాచ్‌లో ఈ బౌలర్‌ను చిత్తుగా చిత్తుగా బాదారు సఫారీ బ్యాటర్లు. డేవిడ్ మిల్లర్ మరియు క్వింటన్ డి కాక్ గౌహతిలో అర్షదీప్ 19 ఓవర్ లో 26 పరుగులు పిండుకున్నారు. అర్ష్‌దీప్ నాలుగు ఓవర్లలో 62 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత దీపక్ చాహర్ ఆకట్టుకున్నాడు.

అయితే, అతను ఇంకా T20 ప్రపంచ కప్ యొక్క ప్రధాన జట్టులో భాగం కాలేదు. ఆటగాడు గాయపడితేనే దీపక్ కి అవకాశం లభిస్తుంది.ఆసియా కప్ 2022లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ప్రతి మ్యాచ్‌ను కచ్చితంగా ఆడతాడు. అయితే అతను నాలుగు ఓవర్లు వేస్తాడా లేదా అన్నది చూడాలి. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌ల జోడీ డెత్ ఓవర్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంటుంది. లేకపోతే అసలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది

 

 

shubaman Gill ఫైనల్ వన్డేలో టీమిండియా ఘన విజయం…కాని అది ఒక్కటే బాధ.

CLICKHERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

శ్రీలంకతో భారత్ తొలి టీ20లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యంగ్ స్టార్.శ్రీలంకతో భారత్ తొలి టీ20లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యంగ్ స్టార్.

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆటగాళ్లంతా ఏదో ఒకలా ఆకట్టుకున్నారు. అయితే యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం బ్యాటుతోనే కాదు.. తన సూపర్ ఫీల్డింగ్‌తో కూడా అందరికీ

ఒకప్పుడు స్టార్ క్రికెటర్ … ఇప్పుడు రోజు కూలీ…ఒకప్పుడు స్టార్ క్రికెటర్ … ఇప్పుడు రోజు కూలీ…

క్రికెట్ అనేది ఆటగాళ్లకు విపరీతమైన డబ్బు తెచ్చిపెట్టే ఒక ప్రసిద్ధ క్రీడ. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌ను భారతదేశం నిర్వహిస్తుంది మరియు ఆ లీగ్‌లోని ఆటగాళ్ళు ప్రతి సీజన్‌లో చాలా డబ్బు సంపాదిస్తారు. అయితే, క్రికెట్ ప్లేయర్‌గా జీవితం చాలా సులభం

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను విరాట్ దాటేస్తాడా?క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను విరాట్ దాటేస్తాడా?

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లీడింగ్ స్కోరర్‌గా ఈ ఏడాది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ అసాధారణ నైపుణ్యాలు, ఆటతీరు మరో చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయపడ్డాడు. రోహిత్