pregnyadigital వినోదం,సినిమా పాన్ ఇండియా స్టార్ తో సందడి చేయనున్న బాలయ్య..

పాన్ ఇండియా స్టార్ తో సందడి చేయనున్న బాలయ్య..


బాలయ్య అన్‌స్టాపబుల్‌ విత్ NBKకి అద్భుతమైన స్పందన లభిస్తోంది మరియు ఈ షో రోజురోజుకు మరింత క్రేజ్ పొందుతోంది. సీజన్ 2లో సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి బాలయ్యతో సందడి చేస్తున్నారు. లాస్ట్ ఎపిసోడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, విచ్చేసి సినిమాలు మరియు వ్యక్తి గత విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పటి వరకు టాప్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేయడంతో తిరుగులేని అన్‌స్టాపబుల్‌ 2కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కానీ, అభిమానుల్లో ఎక్కడో ఓ చోట అసంతృప్తి నెలకొని ఉంది. సీజన్ 1లో చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్ లుగా వచ్చారు.. కానీ సెకండ్ సీజన్ లో మాత్రం పొలిటికల్ మసాలా పెరిగిపోయిందని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

అలాంటి వారి కోసం బాలయ్య పాన్ ఇండియా హీరోని పట్టుకుంటున్నాడు. మరి హీరో ఎవరంటే.. ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది..? ఈషోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నట్లు సమాచారం. ఒక్కడే కాదు.. అతనితో పాటు తన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ కూడా రాబోతున్నాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నవంబర్ 11న ప్రారంభం కానుంది. ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఈ సినిమా తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. ప్రభాస్ తో తన అనుబంధం గురించి గోపీచంద్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. బాలయ్య తో కలిసి వీరిద్దరూ సందడి చెయ్యబోతున్నారు.

Tags:

Related Post

NTR 30 పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అంటున్న హీరోయిన్NTR 30 పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అంటున్న హీరోయిన్

NTR 30 పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అంటున్న హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా కొరటాల శివ ఒక పవర్ఫుల్ పాన్ ఇండియా కథను కూడా

NTR బాలీవుడ్‌ నుంచి కష్టమే.. సౌత్‌కే ఫిక్సయ్యారా?NTR బాలీవుడ్‌ నుంచి కష్టమే.. సౌత్‌కే ఫిక్సయ్యారా?

NTR బాలీవుడ్‌ నుంచి కష్టమే.. సౌత్‌కే ఫిక్సయ్యారా? కొరటాల శివ కాంబినేషన్‌‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా ఎన్ని రూమర్స్.. వార్తలుగా వైరల్ అయ్యాయో.. అవుతున్నాయో తెలియంది కాదు. సినిమా షూటింగ్

హిట్లర్, ముస్సోలిని తర్వాత చంద్రబాబే…ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలుహిట్లర్, ముస్సోలిని తర్వాత చంద్రబాబే…ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటనలు గుప్పిస్తున్నారని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. గడ్డి కంటే ప్రజల ప్రాణాలే విలువైనవని, వర్మ విమర్శలకు లొంగబోనని నాయుడు బదులిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు