pregnyadigital జాతీయం,ప్రముఖుల నవీకరణలు చంద్రబాబును పోలవరానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు-అక్కడే ధర్నా.

చంద్రబాబును పోలవరానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు-అక్కడే ధర్నా.


APలో TDP అధినేత.. చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ఇవాళ ఉద్రిక్తంగా మారింది. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. తర్వాత జంగారెడ్డి గూడెం మీదుగా పోలవరం వెళ్లారు. అయితే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. జంగారెడ్డి గూడెం నుంచి పోలవరం గ్రామానికి చేరుకున్న చంద్రబాబు అక్కడే రోడ్ షో ఏర్పాటు చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లేందుకు బయలుదేరారు చంద్రబాబు …కానీ పెర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు అక్కడ ఏర్పడ్డాయి. పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు…దీంతో పోలవరం గ్రామం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డుపై చేరుకున్న చంద్రబాబు అక్కడే బైఠాయించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తనను పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటి అని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు మాత్రం వెనక్కితగ్గలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంద్రబాబును వెళ్లనిచ్చేది లేదని భీష్మించారు. దీంతో టీడీపీ నేతలు నినాదాలు చేస్తూ చంద్రబాబుతో కలిసి బైఠాయించారు. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు వెళ్లే దారి మొత్తం టీడీపీ కార్యకర్తల హంగామా ,హడావుడితో నిండిపోయింది.

Tags:

Related Post

మోదీ ప్లాన్ తో పవన్ – కొత్త ట్విస్ట్. మీరు కోరుకుంటే నేను సీఎం అవుతా\” – అక్కడే మెలిక!మోదీ ప్లాన్ తో పవన్ – కొత్త ట్విస్ట్. మీరు కోరుకుంటే నేను సీఎం అవుతా\” – అక్కడే మెలిక!

తన షరతు నెరవేరితేనే టీడీపీ-జనసేన కూటమిలో చేరతానని పవన్ ప్రకటించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్న వేళ.. మహాకూటమిలో భాగస్వామ్యానికి తాను ధీమా వ్యక్తం చేశారు. భౌతిక నష్టంతో పాటు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మనిషి

China New Virus కరోనాకు పుట్టిల్లు చైనా మరోసారి మహమ్మారితో వణుకుతోంది.China New Virus కరోనాకు పుట్టిల్లు చైనా మరోసారి మహమ్మారితో వణుకుతోంది.

చైనా మరోసారి మహమ్మారిని ఎదుర్కొంటోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మళ్లీ కష్టాల్లో కూరుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డా. అమెరికాకు చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు ఎరిక్ డింగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడికి గురువు. ఆసుపత్రులంటే ప్రజలు చాలా ఒత్తిడి,

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ పర్వం కొనసాగుతోంది.గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ పర్వం కొనసాగుతోంది.

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ పర్వం కొనసాగుతోంది. బడా హీరోల పుట్టిన రోజుల సందర్భంగా 4K పేరుతో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ,ప్రభాస్ ,బాలయ్య లాంటి హీరోల సినిమాలను