pregnyadigital రాష్ట్ర వార్తలు (Telangana) మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..

మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..


మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.

IT Raids On Telangana Minister Malla Reddy:

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని మంత్రి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లలో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.

ఐటీ శాఖ పన్ను ఎగవేత విభాగానికి చెందిన దాదాపు 50 బృందాలు మంగళవారం తెల్లవారుజామున కొంపల్లిలోని పామ్ మెడోస్ విల్లాల్లో సోదాలు ప్రారంభించాయి.

రాజశేఖర్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. అతను హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలో అనేక కళాశాలలను నడుపుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ సోదాల్లో మొత్తం 50 బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల, తెలంగాణలోని మరో మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, మరోమంత్రి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం కలకలం రేపుతోంది.

 

 

 

Related Post

అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. :అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. :

తెలంగాణ రాజకీయాలు సవాళ్లతో కూడుకున్నాయి. ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని పరోక్షంగా విమర్శించారు. ఈ సవాళ్లు భవిష్యత్తులోనూ తెలంగాణ రాజకీయాలలో

2023లో తెలంగాణకు ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఇదే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్…2023లో తెలంగాణకు ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఇదే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్…

తెలంగాణ ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన సెలవుల వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారం మరియు నెలలో రెండవ శనివారం మూసి ఉండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవులు మరియు చెల్లింపు సెలవుల

Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?

Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..? గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి.. కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. Kanti