pregnyadigital జాతీయం Kim Jong Un: తొలిసారి తన కూతురుని ప్రపంచానికి చూపించిన కిమ్….

Kim Jong Un: తొలిసారి తన కూతురుని ప్రపంచానికి చూపించిన కిమ్….


ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏది చేసిన సంచలనమే. తన మొండి వైఖరి కారణంగా.. ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీ అంటే ఢీ అంటూ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. ఉత్తరకొరియాకు మిత్ర దేశాలకంటే, శత్రువులే ఎక్కువ. అందుకే.. తనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు కిమ్. అయితే ఇటీవల కిమ్ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంత గోప్యంగా ఉండే కిమ్.. ఇప్పుడు తన కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి కనిపించిన కిమ్.. తాజాగా తన కూతురుతో కలిసి తొలిసారిగా పబ్లిక్‌గా కనిపించాడు. ఇలా ఆయన కుమార్తెతో కనిపించడం ప్రపంచవాప్తంగా చర్చనీయాంశమైంది.KCNA కిమ్ తన కుమార్తెతో చేయి చేయి కలిపి నడుస్తున్న ఫోటోలను ప్రచురించింది. నవంబర్ 18న క్షిపణి ప్రయోగాన్ని చూసేందుకు కిమ్ తన కూతురిని వెంట తెచ్చుకున్నాడు. ఉత్తర కొరియా గురువారం పాంగాంగ్ అంతర్జాతీయ ఎయిర్‌ఫీల్డ్ నుండి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ నెలలో ఉత్తర కొరియా ప్రారంభించిన రెండో టెస్టు ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంపై పడింది. ఒకే దాడిలో మొత్తం అమెరికా ప్రధాన భూభాగాన్ని నాశనం చేయగల సామర్థ్యం తమకు ఉందని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. వాస్తవానికి కిమ్ వ్యక్తిగత జీవితం ఇప్పటికీ రహస్యమే. బాస్కెట్ బాల్ మాజీ స్టార్ డెనిస్ రోడ్మన్ 2013లో బ్రిటిష్ డైలీ ‘గార్డియన్’తో మాట్లాడుతూ.. కిమ్‌కు ఓ కుమార్తె ఉందని, ఆమె పేరు ‘జు ఏ’ అని పేర్కొన్నారు. తాను ఆయన కుటుంబంతో గడిపానని చెప్పుకొచ్చారు. కిమ్‌ను మంచి తండ్రిగా అభివర్ణించిన ఆయన.. కిమ్ భార్య ‘రి సోల్ జు’తోనూ మాట్లాడానన్నారు. కాగా, జులై 2012 వరకు కిమ్-రి వివాహంపై ప్రభుత్వ మీడియా వెల్లడించలేదు. అప్పటికి మూడేళ్ల ముందే వీరి వివాహాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఆ తరువాత కొంతకాలానికి 2018లో నార్త్ కొరియా అధికారిక మీడియా కిమ్ భార్యకు ‘ప్రథమ మహిళ’గా పట్టం కట్టింది. కాగా, కిమ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

PM Modi: వారనాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం.. సదస్సుకు పంచకట్టుతో హాజరైన ప్రధాని మోదీ..PM Modi: వారనాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం.. సదస్సుకు పంచకట్టుతో హాజరైన ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ద్రావిడ

హిట్లర్, ముస్సోలిని తర్వాత చంద్రబాబే…ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలుహిట్లర్, ముస్సోలిని తర్వాత చంద్రబాబే…ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటనలు గుప్పిస్తున్నారని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. గడ్డి కంటే ప్రజల ప్రాణాలే విలువైనవని, వర్మ విమర్శలకు లొంగబోనని నాయుడు బదులిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు

Train Accident: అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలుTrain Accident: అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాజ్‌పూర్ కొరై స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో స్టేషన్‌ భవనం దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు