pregnyadigital పాలిటిక్స్ Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసు.. ఎనిమిది మంది అరెస్టు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసు.. ఎనిమిది మంది అరెస్టు


కవిత VS అరవింద్ దాడి కేసు మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు దాడి చేయగా.. వీరిపై కేసులు నమోదయ్యాయి. అంతే కాదు దాడి చేసిన వారిలో ఎనిమిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎంపీ అరవింద్ చేసిన ఫోన్ కాల్ కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి. కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపన సమయంలో ఎమ్మెల్సీ కవితకు ప్రాధాన్యతనివ్వలేదనీ. దీంతో కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారనీ. ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని అర్వింద్ అన్నారు. ఈ మాటలకు ఎమ్మెల్సీ కవిత  ఫైర్ అయ్యారు. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదనీ.. అరవింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తానని సవాల్ విసిరారు. మళ్లీ మాట్లాడితే.. కొట్టి సంపుతం అంటూ కవిత కామెంట్ చేశారు.

సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ జాగృతి శ్రేణులు హైదరాబాద్ లోని అరవింద్ ఇంటిపై దాడికి దిగారు. ఇంటి ఆవరణలోని పూల మొక్కలు, కారు, ఇంట్లోని ఫర్నీచర్, దేవుడి పటాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఇంట్లో అరవింద్ తల్లి ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్ లో దిశ సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడి విషయం తెలుసుకున్న అరవింద్, కవితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది కుల అహంకారంతో జరిగిన దాడిగా వర్ణించారు.

అయితే, ఈ దాడిలో పాల్గొన్న వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు బంజారాహిల్స్ పోలీసులు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నెగోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేశారు ఎంపీ అరవింద్. కవితను సైతం అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. :అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. :

తెలంగాణ రాజకీయాలు సవాళ్లతో కూడుకున్నాయి. ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని పరోక్షంగా విమర్శించారు. ఈ సవాళ్లు భవిష్యత్తులోనూ తెలంగాణ రాజకీయాలలో

JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?JR NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా?

Jr.NTR ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బాలయ్యని తిట్టలేరా? JR NTR తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ

జగన్ కు ఝలక్ ఇచ్చిన కెసిఆర్ ?జగన్ కు ఝలక్ ఇచ్చిన కెసిఆర్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తోట చంద్రశేఖర్ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఊపందుకుంది. ఇటీవల, అతను ఒక టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ప్రణాళికల గురించి మాట్లాడాడు. అమరావతి రాజధానిపై వివాదం నడుస్తున్న తరుణంలో మీ పార్టీ ఒక్క