pregnyadigital రాష్ట్ర వార్తలు (Telangana) Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?

Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?


Telangana ప్రజలకు శుభవార్త మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..?

గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి.. కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Kanti Velugu programme: తెలంగాణలో వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాలను పరిశీలించారు. ప్రజారోగ్యం, వైద్యం, తదితర అంశాలపై  CM KCR గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు అందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి కండ్లజోడులు అందించిందని తెలిపారు. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవంటూ పేర్కొన్నారు.

పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. గతంలో అందించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారానే కంటి పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పనులు చేపట్టేందుకు అవసరమైన వనరులు, సామగ్రిని సమకూర్చుకోవాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దాదాపు 40,000 మందికి కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు.

కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికి రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో నాణ్యతను పరిశీలించి చాలా వరకు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని రోడ్లను ఏవిధంగా అభివృద్ధి పరచాలో, అలాగే వాటిని చక్కగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. రోడ్ల మరమ్మతులు, ఇతరత్రా సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం నుండి మంత్రులు, అలాగే వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

2023లో తెలంగాణకు ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఇదే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్…2023లో తెలంగాణకు ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఇదే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్…

తెలంగాణ ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన సెలవుల వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారం మరియు నెలలో రెండవ శనివారం మూసి ఉండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవులు మరియు చెల్లింపు సెలవుల

మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. IT Raids On Telangana Minister Malla Reddy: హైదరాబాద్,

MMTS: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు MMTS సర్వీసులు రద్దు..MMTS: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు MMTS సర్వీసులు రద్దు..

హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలక్‌నుమా లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్