pregnyadigital వార్తలు మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చివేత.

మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చివేత.


మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చివేత.

మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన కాలనికి సంబందించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ పై కొందరు కాలనీ వాసుల సహకారం తో వంగల వినయ్ అనే వ్యక్తి హైకోర్టు లో పిటీషన్ వేయగా శుక్రవారం సొసైటీ ఆఫీస్ ని GHMC వాళ్ళు కూల్చివేయడం జరిగింది. వంగల వినయ్ అనే వ్యక్తి కోర్ట్ ని ఆశ్రయించి పిటిషన్ వేసి పార్కు లో నిర్మించిన షెడ్డు మరియు సొసైటీ బిల్డింగ్ లను అక్రమంగా నిర్మించారు అని కోర్ట్ దగ్గర స్టే తో గత నెల 20 వ తారీకునా పార్క్ లో వున్న షెడ్డును GHMC వారు కూల్చివెయ్యగా. దీంతో కాలనీ అసోసియేషన్ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అమలులో ఉన్న కూల్చివేత ఆదేశాల పై ఎటువంటి జోక్యం చేసుకోబోమని తేల్చేసింది.

గురువారం ఈ కేసు విచారణ జరుగగా పిటిషనర్ వాదన వైపే మొగ్గు చూపిన ధర్మాసనం పార్కుస్థలం లో ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది రంగంలోకి దిగారు. మాతృశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి చేరుకొని వెంటనే కూల్చివేత మొదలు పెట్టాల్సి ఉందని భవనాన్ని ఖాళీ చేయాలని సొసైటీ ఆఫీస్ సిబ్బంది కి మరియు అడాక్ కమిటీకి సూచించారు. గత నెలలో షెడ్డును కూల్చేసిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Naveen Reddy: వైశాలిని పెళ్లి చేసుకున్నాడా..? కీలక విషయాలు బయటపెట్టిన \’మిస్టర్ టీ\’ నవీన్ రెడ్డి తల్లిNaveen Reddy: వైశాలిని పెళ్లి చేసుకున్నాడా..? కీలక విషయాలు బయటపెట్టిన \’మిస్టర్ టీ\’ నవీన్ రెడ్డి తల్లి

తన ప్రియురాలు వైశాలిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టయిన డెంటిస్ట్ నవీన్ రెడ్డి. ఇది చాలా వివాదానికి కారణమైంది ఎందుకంటే నవీన్ రెడ్డి \”మిస్టర్ టి\” అనే ప్రసిద్ధ టీవీ షో వ్యవస్థాపకుడు. వైశాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌రెడ్డిని

RRR: RRR టీం దానికోసమే జపాన్ వెళ్లనుందా?RRR: RRR టీం దానికోసమే జపాన్ వెళ్లనుందా?

RRR: RRR టీం దానికోసమే జపాన్ వెళ్లనుందా?   దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం \’ఆర్ఆర్ఆర్\’. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ సంపాందించింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న జపాన్‌లో

పవన్ కు షాక్ ఇచ్చిన జగన్.పవన్ కు షాక్ ఇచ్చిన జగన్.

1990లో ఆమోదించిన AP 30 పోలీస్ చట్టం బహిరంగ సభలు మరియు రోడ్‌షోలను నిషేధించింది మరియు పోలీసుల అనుమతితో మాత్రమే వాటిని నిర్వహించడానికి అనుమతించింది. తీవ్ర ఉద్రిక్తత సమయంలో సంభవించిన జీవో నెం.1 కుప్పం పర్యటన ఈ చట్టాన్ని చర్యగా ఉదహరిస్తుంది.